ప్రకృతి ప్రేమికులు తమకున్న ప్రేమను వివిధ రూపాల్లో వినూత్నంగా తెలియజేస్తుంటారు. నూతన యువ ఐఆర్ఎస్ అధికారి శశికాంత్ తన వివాహ ఆహ్వాన పత్రికను విత్తన పత్రిక రూపంలో తయారు చేసి ఆహ్వానితులకు అందజేయడం ఆశ్చర్యపరుస్తోంది.
ఈ పత్రిక పేపర్ తో పాటు విత్తనాలు అందులోనే ఉండడం వల్ల మనకు మొక్కకు కావాల్సిన చోట వాటిని నాటి సంరక్షిస్తే ఆ విత్తనాలు మొలకెత్తి చెట్టుగా ఉద్భవిస్తాయి.
ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను కలిసి తన వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి పత్రిక విశిష్టతను వివరించారు శశికాంత్.
ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మాలాంటి ఎంతోమంది పకృతి ప్రేమికుల్లో ఉత్సాహాన్నినింపింది అని, కొత్త ఆలోచనలకు రూపం ఇస్తుందని తెలియజేశారు.
ఇంత మంచి ఆలోచన చేసి విత్తన వివాహ ఆహ్వాన పత్రిక తయారు చేయించిన యువ ఐఆర్ఎస్ అధికారి శశికాంత్ ను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అభినందనలతో ముంచెత్తారు.