38.2 C
Hyderabad
April 29, 2024 13: 46 PM
Slider ప్రత్యేకం

ఏపీలో 22 మంది ఆర్ఐలకు డీఎస్పీ లగా పదోన్నతి….!

#armedforces

రాష్ట్రంలో అదీ పోలీసు శాఖలో మరీ ముఖ్యంగా ఆర్మర్డ్ రిజర్వ్ విభాగంలో 22 మంది ఇన్ స్పెక్టర్లకు డీఎస్పీ లగా పదోన్నతి ఇచ్చారు… రాష్ట్ర డీజీ రాజేంద్రనాధ్ రెడ్డి. ఈ మేరకు కొద్ది సేపటి క్రితమే ఆదేశాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో ఆర్మర్డ్ విభాగంలో ఇన్ స్పెక్టర్లు గా పలువురికి డీఎస్పీ లగా లభించింది. ఇక రేపో మాపో డీజీపీ ఆదేశాల మేరకు డీఎస్పీ లుగా విధులు నిర్వర్తించనున్నారు.ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా ఏఆర్ విభాగం లో ఆర్మర్డ్ ఇన్ స్పెక్టర్ గా ఉన్న మరియన్ రాజుకు డీఎస్పీ గా అలాగే ఏఆర్ అడ్మిన్ గా ఉన్న చిరంజీవి కి కూడా డీఎస్పీ గా పదోన్నతి వచ్చింది. ఇక డీజీపీ ఉత్తర్వుల మేరకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో చూడాలి. అయితే విజయనగరం జిల్లా ఏఆర్ డీఎస్పీ గా ఉన్న శేషాద్రి…. వచ్చి మూడేళ్ల దాటనుండటంతో ఆయన బదిలీ కావొచ్చు లేదా పదోన్నతి రావొచ్చు.ఈ క్రమంలో మరి ప్రస్తుత ఏఆర్ డీఎస్పీ గా కొత్తవారు రావొచ్చే అవకాశాలు ఉన్నాయని “సత్యం న్యూస్. నెట్.” నొక్కి చెబుతోంది.

Related posts

రష్యాకు ఆయుధాలు సరఫరా చేసేవారిపై కట్టడి చర్యలు

Satyam NEWS

హుజూర్ నగర్ పట్టణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి

Satyam NEWS

పేద ప్రజల నడ్డివిరిచిన జగన్ రెడ్డి పాలన

Bhavani

Leave a Comment