దినసరి వేతన కూలీల దినసరి భత్యం పెంపుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో కార్మిక శాఖ, వివిధ శాఖల అధికారులతో రోజువారి కూలీల దినసరి భత్యం పెంపుపై కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 800 మంది రోజువారి కూలీలు వివిధ శాఖల్లో పనిచేస్తున్నట్లు
తెలిపారు. శాఖల వారిగా ఏ ఏ శాఖలో ఎంతమంది, ఏ ఏ పనులు చేస్తున్నది, వారితో ప్రభుత్వం పై ఎంతభారం పడుతున్నది, వారితో శాఖలో ప్రభావం పై నివేదిక సమర్పించాలన్నారు. ద్రవ్యోల్బణం అంచనా వేసి, దాని ప్రకారం భత్యం పెంపుకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో కార్మిక ఉప కమీషనర్ రమేష్, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, కార్మిక సహాయ కమీషనర్ వెంగమాంబ, సహాయ కార్మిక అధికారి శాస్త్రి, ఇర్రిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.