29.7 C
Hyderabad
April 29, 2024 07: 50 AM
Slider ఖమ్మం

దినసరి భత్యం పెంపుకు ప్రతిపాదనలు

#daily allowance

దినసరి వేతన కూలీల దినసరి భత్యం పెంపుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో కార్మిక శాఖ, వివిధ శాఖల అధికారులతో రోజువారి కూలీల దినసరి భత్యం పెంపుపై కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 800 మంది రోజువారి కూలీలు వివిధ శాఖల్లో పనిచేస్తున్నట్లు

తెలిపారు. శాఖల వారిగా ఏ ఏ శాఖలో ఎంతమంది, ఏ ఏ పనులు చేస్తున్నది, వారితో ప్రభుత్వం పై ఎంతభారం పడుతున్నది, వారితో శాఖలో ప్రభావం పై నివేదిక సమర్పించాలన్నారు. ద్రవ్యోల్బణం అంచనా వేసి, దాని ప్రకారం భత్యం పెంపుకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అన్నారు.

ఈ సమావేశంలో కార్మిక ఉప కమీషనర్ రమేష్, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, కార్మిక సహాయ కమీషనర్ వెంగమాంబ, సహాయ కార్మిక అధికారి శాస్త్రి, ఇర్రిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే: రాజమండ్రి వైసీపీలోనూ రచ్చ రచ్చ…

Satyam NEWS

బీడీ కార్మికులకు డబులు బెడ్ రూమ్ లు ఇవ్వాలి

Satyam NEWS

వాట్సాప్ ద్వారా నీట్,జేఈఈ గ్రాండ్ టెస్ట్స్

Satyam NEWS

Leave a Comment