సుభిక్షమైన పాలన ప్రజలకు అందాలంటే షర్మిలమ్మ ద్వారానే సాధ్యమవుతుందని అర్జున్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి పతంలో ,సుపరిపాలన దిశగా సాగాలంటే వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్సార్ షర్మిల ద్వారానే సాధ్యమవుతుందని సోమవారం ఆమనగల్ మండలం ఆకుతోటపల్లిలో నాయకులు అర్జున్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ పాలనతోటే ఆరోగ్యశ్రీ, రైతుల రుణమాఫీ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి దేనిని కొరియాడారు. అవే సంక్షేమ పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలతో షర్మిలమ్మ అధికారంలోకి రావటంతో అమలు చేస్తారని తెలిపారు.
నియోజకవర్గం అభివృద్ధి, సుపరిపాలన అందించడం వైయస్సార్ తెలంగాణ పార్టీ వల్లే అవుతుందని గుర్తించిన ఆమనగల్ మండలం ఆకుతోటపల్లి పులిగోని పల్లి తండా లోని కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి భారీగా యువకులు పెద్దలు చేరారని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిన్నారెడ్డి యాదగిరి పర్వతాలు నరేందర్ తిరుపతి సునీల్ నాయక్ వినోద్ కుమార్ శంకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.