ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రోజు రోజు కి పెరుగుతున్న భూ మాఫియా ను అరికట్టాలని బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ లో బాధితులతో కలిసి ఆయన DSP కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సర్వేనెంబర్ 68 భూ బాధితులకు సంబంధించి కొందరు గూండాలు వారిని బెదిరిస్తున్నారని ఈ భూ బాధితుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ అన్నారు.
సర్వేనెంబర్ 68 లో భూమి కొనుగోలు చేసిన కొందరిని గుండాలు బెదిరిస్తున్నారని అన్నారు. బాధితుల ఫిర్యాదు ను పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా డిఎస్పీ దీనిపై చర్య తీసుకోవాలని కోరారు.