ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనను వ్యతిరేకిస్తూ మంగళగిరి పట్టణంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, సిపిఐ ఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ నరేంద్ర మోడీ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు బిజెపి ప్రభుత్వం నష్టం చేసిందని ఈ సందర్భంగా నేతలు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్లకు కారు చౌకగా అమ్మడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జె వి రాఘవులు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చెంగయ్య , సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ, సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, సిపిఐ ఎంఎల్ నాయకులు కే కోటేశ్వరరావు, ఆదినారాయణ, ప్రసాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోలి నాగ కుమార్, జి వెంకయ్య వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
previous post