ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సుస్థిరమైన సుపరిపాలన జరుగుతుందని దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి అన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ గుడిదిబ్బ సెంటర్ లో బుధవారం రాత్రి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ పేడ్ రైతు కమిటీ మాజీ చైర్మన్ కొటారు రామచంద్రరావు, ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరివై సి పి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. కొటారు రామచంద్రరావు చేతుల మీదుగా కేక్ ను కట్ చేశారు.
ఈ సందర్భంగా కొటారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సీఎం ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరుశాతం అమలు చేశారని చెప్పారు. ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి పాలనలో దెందులూరు నియోజక వర్గం అభివృద్ధి లో అగ్రగామిగా ఉందని తెలిపారు.