ప్రోగేసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ సంఘం (PRTU TS IERP UNION) నూతన సంవత్సర క్యాలెండరు ను PRTU జిల్లా అధ్యక్షులు సూర్య శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. నాగర్ కర్నూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో PRTU జిల్లా గౌరవ అధ్యక్షులు రాంచందర్ రావు, ప్రధాన కార్యదర్శి సురెందర్ రెడ్డి పత్రికా సంపాదకులు సత్యనారాయణ రెడ్డి, జిల్లా విలీన విద్య సమన్వయ కర్త వెంకటయ్య, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా PRTU జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ IERPల సమస్యలు తమ సమస్యలుగా భావించి వాటి పరిష్కారం కోసం ఎల్లవేళల కృషి చేస్తామని తెలిపారు. అనంతరం సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు 30% PRC వర్తించే విధంగా కృషి చేసిన సందర్భంగా PRTU, జిల్లా సెక్టోరియల్ అధికారులకు పూలమాలలు శాలువాలతో సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారులు వెంకటయ్య, సతీష్ కుమార్, ప్రోగేసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ సంఘం జిల్లా అధ్యక్షులు మాధని రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యామ్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు వాణి, ఐ ఈ ఆర్ పి లు ప్రకాష్, జయ ప్రకాష్ శ్రీనివాసులు, రంజిత్ కుమార్, అహ్మద్, నిరంజన్, రమేష్, తిరుపతయ్య, వెంకటయ్య, శ్రీలత, సరిత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.