29.7 C
Hyderabad
April 29, 2024 07: 18 AM
Slider జాతీయం

శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ47

pslv c 47

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ47 నింగిలోకి దూసుకెళ్లింది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని ఉదయం 9.28 గంటలకు చేపట్టారు. అనంతరం 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టారు. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ47 ప్రయోగానికి మంగళవారం ఉదయం 7.28 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది.

ఈ ప్రక్రియ 26 గంటలపాటు సాగింది. చంద్రయాన్‌-2 తర్వాత ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగమిది. ఈ ప్రయోగం ద్వారా కార్టోశాట్‌-3తోపాటు  అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపుతున్నారు. ఇది మూడోతరం హైరెజల్యూషన్‌ ఎర్త్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం కార్టోశాట్‌-3. దీని జీవిత కాలం ఐదేళ్లు. బరువు సుమారు 1625 కిలోలు. పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించిన సేవలను ఇది అందించనుంది. ఉగ్రవాద శిబిరాలను కార్టోశాట్‌-3 మరింత స్పష్టంగా తీయనుంది.

Related posts

వైభవంగా తుంగభద్ర పుష్కర పూజలు ప్రారంభించిన పీఠాధిపతి

Satyam NEWS

తొణికిన స్వప్నం

Satyam NEWS

6129 కొనుగోలు కేంద్రాల ద్వారా 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

Satyam NEWS

Leave a Comment