చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గం, పాకాల మండలం, నేండ్రగుంట గ్రామంలోని శ్రీ మూలస్థానమ్మ దేవాలయంలో గురువారం ప్రారంభమైన నవరాత్రి ఉత్సవ వేడుకల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ శ్రీ పులివర్తి నాని దంపతులు పాల్గొన్నారు. అమ్మవారి ఆలయం ముందు నుంచి పులివర్తి నాని, పులివర్తి సుధారెడ్డి లను పూర్ణ కుంభంతో సాదర స్వాగతం పలికారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, మండల టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలయంలో 9 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు సేవ చేయాలని పులివర్తి నాని పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా సూచించారు.