29.7 C
Hyderabad
May 3, 2024 06: 55 AM
Slider ఆధ్యాత్మికం

టిటిడి ఆధీనంలో పుంగ‌నూరు శ్రీ క‌ల్యాణ వేంక‌ట‌ర‌మ‌ణ‌స్వామి ఆల‌యం

#Minister Peddireddy Ramachandrareddy

చిత్తూరు జిల్లా పుంగ‌నూరులోని కోనేటిపాళ్యంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌ట‌ర‌మ‌ణ‌స్వామివారి ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం శ‌ని‌‌వారం జ‌రిగింది. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌మ‌క్షంలో ఈ విలీన కార్య‌క్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

అనంత‌రం రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ చంద్ర‌మౌళి ఆల‌యానికి సంబంధించిన రికార్డులు, ఇత‌ర ప‌త్రాల‌ను టిటిడి డెప్యూటీ ఈవో శాంతికి అంద‌జేశారు. శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌‌‌స్వామివారి ఆల‌య స‌ముదాయంలో ఈ ఆల‌యాన్ని చేర్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో పార్ల‌మెంటు స‌భ్యులు రెడ్డెప్ప‌, టిటిడి ఏఈవో ధ‌నంజ‌యులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ వ‌ర్మ‌, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌త్యేకాధికారి రాజ‌శేఖ‌ర్‌నాయుడు, ఆల‌య ఈవో క‌మ‌లాక‌ర్‌, సూప‌రింటెండెంట్లు న‌ట‌రాజు చెంగ‌ల్రాయ‌లు, అర్చ‌కుడు బాలాజి రంగాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

కరోనా ప్రకోపంతో పంజాబ్ రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు

Satyam NEWS

జాతీయ బీసీ కమిషన్ కు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు

Satyam NEWS

కెసిఆర్ హామీలన్నీ అబద్దాలే

Bhavani

Leave a Comment