నరసరావు పేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తన అల్లుడు పుట్టా మహేష్ ను తెలుగుదేశం పార్టీ నుంచి రంగంలోకి దింపేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు చేసిన ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అంగీకరించారు. యనమలకు మంచి బలమైన వర్గంతోపాటు.. తను పెండ్లి చేసుకున్న నియోజకవర్గం అదే కావడంతో.. ఆస్ధానం నుండి తన అల్లుడిని రంగంలో దించేందుకు నిర్ణయించుకున్నారు. తన ఇద్దరు బిడ్డలు కావడంతో తన రాజకీయ వారసత్వంకు పుట్టామహేష్ తగిన వ్యక్తిగా యనమల ఎంపిక చేసుకున్నట్లు ఉంది. మైదుకూరు నియోజకవర్గం నుండి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ పోటీచేస్తున్న విషయం తెలిసిందే. తన వియ్యకుండు సూచన మేరకు మహేష్ ను నరసరావుపేటలో పోటీకి దించుతున్నారు. తన అల్లుడు మహేష్ తో కలసి యనమల చంద్రబాబు నాయుడుని కలిసారు.. మొదట చంద్రబాబుతో యనమల అరగంట పాటు తన అల్లుడు రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారు. ఈ చర్చలో పుట్టా మహేష్ ను అనంతపురం పార్లమెంట్ నుండి పోటీ చేసే ఆలోచన యనమలతో చంద్రబాబు తీసుకువచ్చినట్లు రాజకీయ సమాచారం.
నరసరావు పేట పార్లమెంట్ నియోజకవర్గంలో తన పెండ్లి చేసుకోవడంతో పాటు, బంధు వర్గం అధికంగా ఉందని మహేష్ ను అక్కడి నుంటి పోటీ చేయడం బాగుంటుందనే ఆలోచన చంద్రబాబు వద్ద యనమల ప్రస్ధావించగా.. ఇందుకు చంద్రబాబు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడుతో భేటి ముగిచిన తర్వాత పుట్టా మహేష్ ను చంద్రబాబు వద్ద కు పంపించారు.. యనమల సూచన మేరకు చంద్రబాబును కలిసి శాలువతో త్కరించి..పుష్ఫగుచ్చంను మహేష్ అందించారు. అనంతరం పుట్టా మహేష్ తో చంద్రబాబు మరో అరగంట ఇద్దరు ఏకాంతంగా చర్చించినట్లు సమాచారం.. మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉందా? రాష్ట్రంలో ఎక్కడునుండైనా పోటీ చేయగలరా? అంటూ వివిధ కోణాల్లో రాజకీయ చర్చ పుట్టా మహేష్ యాదవ్ తో చంద్రబాబు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.. చివరకు యనమల సూచించినట్లు నరసరావుపేట ఎంపీ స్ధానానికి మహేష్ ను బరిలో దింపేందుకు చంద్రబాబు మొగ్గు చూపారు.