జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు కాగజ్ నగర్ మండలంలోని చిన్నమాలిని గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన ముగ్గురిపై కేసులు నమోదు చేసి వారి పంట చేనులో ఉన్న138 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశామని ఎక్సైజ్ సీఐ టి. మహేంద్ర సింగ్ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ టి. మహేంద్ర సింగ్ తోపాటు సిబ్బంది రాజ్ కుమార్, రవికుమార్, కుమార్, దుర్గాప్రసాద్, రాజశేఖర్, సిరిపూర్ పోలీస్ ఏ ఎస్ ఐ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
previous post