31.7 C
Hyderabad
May 2, 2024 08: 57 AM
Slider మహబూబ్ నగర్

పురుగుల మందు తాగి మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

#kalwakurthy

మండలంలో చేసిన అభివృద్ధి పనులకు డబ్బులు ఇవ్వలేదంటూ పురుగుల మందు తాగి మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేశారు.నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండపేట మండలం మాజీ సర్పంచ్ శ్రీనివాసులు మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గతంలో పలు అభివృద్ధి పనులకు గాను అప్పులు చేసి మరీ గ్రామంలో పనులు చేయించానని అందులో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వం నుండి మంజూరైనను గ్రామపంచాయతీ ప్రస్తుత సర్పంచ్, కార్యదర్శి ఇరువురు కలిసి చెక్కుని ఇచ్చారని ఖాతాలో డబ్బులు లేక చెక్కు తిరిగి వచ్చిందని ఈ విషయాన్ని ప్రశ్నించగా ఏమి చేసుకుంటావో చేసుకోమని ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకోమని దురుసుగా మాట్లాడడంతో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు.జిల్లా కలెక్టర్ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ కు తమ ఫిర్యాదును బదిలీ చేశారని అయినను నేటికీ ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విసుకు చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు.

Related posts

ఘనంగా అమృత లత అపురూప అవార్డుల ప్రదానోత్సవం

Satyam NEWS

యాదాద్రి వద్ద భారీ ఎత్తున పట్టుబడ్డ బంగారం

Satyam NEWS

విజయా డైరీ ప్రైవేట్ పరం ఆలోచన లేదు

Satyam NEWS

Leave a Comment