39.2 C
Hyderabad
April 30, 2024 21: 26 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామచంద్ర స్వామి కోవెలలో భక్తి శ్రద్ధలతో రథసప్తమి వేడుకలు

#venugopalaswamytemple

శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో మంగళవారం రధసప్తమి వేడుకను మహిళలు భక్తి శ్రద్ధలతో,నిష్టగా, ఆచరించారు.

ఆలయ అర్చకులతో ప్రాతః కాల అర్చనతో ప్రారంభమై,ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారికి పంచసూక్త విధానంగా పంచామృత అభిషేకం,నాగవల్లి దళాలతో ఆకు పూజ నిర్వహించి, అనంతరం సహజమైన గోవు పిడకలతో,  గోక్షీరంతో పొంగళ్ళు మహిళలు భక్తితో స్వయంగా తయారు చేసి,విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం,ఆదిత్య హృదయ పారాయణాన్ని ఏకాదశ మార్లు పఠించారు.

కోటి సూర్య కాంతుల సూర్య భగవానునికి గులాబి పుష్పాలతో సహస్ర నామార్చన,తిరుప్పావై సేవా కాలన్ని మహిళలు శ్రావ్యంగా ఆలపించారు. లక్ష్మీ అష్టోత్తర శత నామావళిని మహిళా భక్తులు ముక్త కంఠంతో పఠించారు.

భక్తి కార్యక్రమంలో అర్చకులు మురళి కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు దామోదరాచార్యులు, రామకృష్ణమాచార్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు వెన్న పద్మ,వికాస తరంగిణి కార్యకర్తలు భారతమ్మ, మల్లీశ్వరి,ఉమా,హైమా,జయమ్మ భక్తులు సూర్యప్రకాష్ రావు,బెల్లంకొండ సైదులు గౌడ్,పోనుగుపాటి అశోక్, గుండా రమేష్,వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

చెరువు కుంటను పరిరక్షించండి: ముంపు బెడద తప్పించండి

Satyam NEWS

నేటి నుండి శ్రీ సత్య సాయి సూపర్ హాస్పిటల్ లో వైద్య సేవలు బంద్

Satyam NEWS

మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం

Bhavani

Leave a Comment