23.2 C
Hyderabad
May 7, 2024 21: 41 PM
Slider ప్రత్యేకం

ఈ ముఖ్యమంత్రి ధన దాహం బకాసురుని ఆకలి వంటిది

#raghu

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనం దాహం బకాసురుని ఆకలి వంటిదని ప్రజలు భావించే పరిస్థితి నెలపొందని  నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  రఘురామకృష్ణంరాజు  విరుచుకుపడ్డారు. అరువు కోసం జగన్మోహన్ రెడ్డి  రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ అరువు దొరికితే చాలు కరువు తీరిందన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఉందన్నారు. రోడ్ల మరమ్మతులు చేయడానికి గతంలో పెట్రో ఉత్పత్తులపై ఒక్క రూపాయి సెస్సు విధించారు. ఇది చాలదన్నట్లుగా రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి  కొన్ని వేల కోట్ల రూపాయల రుణాన్ని  పొందారు.

ఇప్పుడు రాష్ట్ర రహదారులను కాస్తా, నాబార్డ్ నుంచి రుణం పొందడానికి జిల్లా రహదారులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర రహదారులకు  నాబార్డ్ రుణం ఇవ్వకపోవడం, జిల్లా రహదారులకు  రుణ మంజూరీకి అంగీకరించడం వల్లే జగన్మోహన్ రెడ్డి  ఈ రివర్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు. రోడ్ల మరమ్మత్తుల కోసం బయటి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. సొంత కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి, వారికి నాబార్డ్ నిధులను కట్టబెట్టి పర్సెంటేజీలను కొట్టివేయడానికి మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.

అంతే తప్ప ప్రజల రోడ్ల కష్టాలన్నది తీరే అవకాశాలు లేవనేది సుస్పష్టమని  రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఎవరైనా రాష్ట్ర రహదారులను అప్ గ్రేడ్  చేయాలని చూస్తారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మాదిరిగా, రాష్ట్ర  రహదారులను, జిల్లా రహదారులుగా ప్రకటించడం ఏమిటంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

మీటర్ల కొనుగోళ్ల లో వేలకోట్ల అవినీతి

వ్యవసాయ మీటర్ల కొనుగోళ్లలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెదేపా నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డి  హైకోర్టును ఆశ్రయించినట్లుగా  రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కేవలం కాసుల కక్కుర్తి కోసమే  వ్యవసాయ మోటార్లకు  మీటర్లను బిగించారన్నారు. మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా చెల్లించి మీటర్లను కొనుగోలు చేశారని, ఐదేళ్లపాటు నిర్వహణ  పేరిట తొక్కలో కబుర్లు చెప్పి వేల కోట్లు దోచుకున్నట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందేనన్నారు.

కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం, ప్రజాధనాన్ని దోచుకునేందుకు వ్యవసాయ  మోటర్లకు మీటర్లకు బిగించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని ఎక్కడా చెప్పలేదన్నారు . మీటర్లు ఎందుకంటే ఉత్తుత్తిగానే పెడుతున్నామని  అంటున్నారు. ఆ డబ్బు నేరుగా  రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లించదట. రైతుల అకౌంట్లో వేస్తే, రైతులు విద్యుత్ శాఖ కు చెల్లించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక నెల రైతుల అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయకపోతే, అప్పుడు విద్యుత్ శాఖ అధికారులు వచ్చి వ్యవసాయ మోటార్ల  కనెక్షన్లను కట్ చేస్తారన్నారు.

మోటార్లకు  మీటర్లు బిగించే ప్రక్రియలో రైతులను భాగస్వాములను చేయడం ఎందుకని రఘురామకృష్ణంరాజు  ప్రశ్నించారు. రైతులను భాగస్వాములను చేయకపోతే, మీటర్లు ఎందుకు కొన్నారని  ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉందని తెలిసే, ఈ ప్రక్రియలో రైతులను భాగస్వాములను చేశారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ధన దాహం కోసం రైతులను బలి చేస్తున్నారన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది ఉండదు, చివరకు రైతులు బలి కాక తప్పదు అన్నారు. ఇదే విషయాన్ని చెబుతుంటే, రైతుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించడం విడ్డూరంగా ఉంది. ఆ మాత్రం రైతులు పసిగట్టలేరా? అని ఆయన ప్రశ్నించారు.

ఈ ప్రభుత్వాన్ని రైతులందరూ చీదరించుకుంటున్నారు. కాసుల కక్కుర్తి కోసం మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియ పట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఒకవైపు రాష్ట్ర రైతాంగం తుఫాన్  దెబ్బకు విలవిలలాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంట్లో కూర్చొని పిడేల్  వాయించుకుంటూ, గుళ్ళల్లో శంకుస్థాపనలు చేస్తుండడంతో ఈ ప్రభుత్వానికి గంటసేపు కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదన్న కృత నిశ్చయానికి   ప్రజలు వచ్చారన్నారు. ప్రజలంతా ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారని రఘురామకృష్ణం రాజు చెప్పారు.

రిట్ వేయాలా? పిల్ వేయాలా? అన్నది కూడా మీరే చెబుతారా?

ప్రజా సమస్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చేందుకు రిట్ వేయాలా? పిల్ వేయాలా? అన్నది అడ్వకేట్ జనరల్ శ్రీరామే చెబుతారట అంటూ రఘురామ కృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుకు తూట్లు పొడుస్తూ,  విశాఖపట్నంలో క్యాంప్ కార్యాలయం నెపంతో సతీమణితో సహా  ముఖ్యమంత్రి , కార్యదర్శులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  మకాం మార్చాలని నిర్ణయించడాన్ని తప్పుపడుతూ, గద్దె తిరుపతిరావు, మాదాల శ్రీనివాసరావు అనే ఇద్దరు వ్యక్తులు  హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

దానికి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఇది సరైన విధానం కాదని, రిట్ కాదు పిల్ వేయాలన్నారు. నాలాంటివారు పిల్ వేస్తేనే, పిల్ వేసే అర్హత ఒక ఎంపీ కి లేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారని గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దలు చేస్తున్న తప్పును ఎత్తి చూపడానికి , రిట్ వేయడాన్ని కూడా అడ్వకేట్ జనరల్ తప్పు పట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గద్దె తిరుపతిరావు, మాదాల శ్రీనివాసరావు వేసిన రిట్ పిటీషన్ కు రిజిస్ట్రీ నెంబరింగ్ కేటాయించింది. రిట్ పిటిషన్  స్వీకరణ అర్హత ఉందా?  లేదా అన్నది నిర్ణయించే విచక్షణ అధికారం హైకోర్టు రిజిస్ట్రీ ఉందని చెప్పారు.

అయినా, ఇలా రిట్ వేయడం  ఫోరం షాపింగ్ కిందికి వస్తుందన్న అడ్వకేట్ జనరల్ , పిల్ వేయాలని సూచించడం, రిజిస్ట్రీ ఎందుకు నెంబర్ కేటాయించిందో అర్థం కావడం లేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం పట్ల రఘురామ కృష్ణంరాజు తీవ్ర అభ్యంతరాన్ని తెలిపారు. త్రిసభ్య ధర్మాసనం, ప్రధాన న్యాయస్థానం మాత్రమే ఈ పిటిషన్  విచారించాలని ఆయన కోరడం జరిగిందని అన్నారు. గద్దె తిరుపతిరావు, మాదాల శ్రీనివాసరావు లు ఫోరం షాపింగ్ కు పాల్పడుతున్నారని  అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొన వచ్చా? అన్న రఘురామ కృష్ణంరాజు, మీరు కూడా  అలాగే ఫోరం షాపింగ్ కు పాల్పడుతున్నారనే అనుమానం వారికి రాదా అంటూ నిలదీశారు.

ముఖ్యమంత్రి మూట ముల్లె  సర్దుకొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా విశాఖపట్నం  వెళ్తుంటే గుడ్లప్పగించి చూస్తూ ఉండాలా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు . ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పుడు, ప్రత్యారోపణలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని అడ్వకేట్ జనరల్ శ్రీ రామ్ కు సూచించారు.

Related posts

కేసీఆర్ జన్మదినం సందర్భంగా గట్టమ్మ దేవాలయంలో పూజలు

Satyam NEWS

ఆడపిల్లల జనాభా తగ్గకుండా చూడడం మన బాధ్యత

Satyam NEWS

జాతిపిత మహాత్మా గాంధీ జీవితంపై ఆన్ లైన్ క్విజ్

Satyam NEWS

Leave a Comment