తెలంగాణ బిజెపి మైనారిటీ మోర్చా మీడియా ఇన్ చార్జిగా సీనియర్ నాయకుడు షేక్ రహ్మతుల్లా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు అఫ్సర్ పాషా నియామకపు పత్రాన్ని షేక్ రహ్మతుల్లాకు అందచేశారు.
తనను మీడియా ఇన్ చార్జిగా నియమించినందుకు రహ్మతుల్లా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కి ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తనకు అవకాశం కల్పించిన అఫ్సర్ పాషాకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ లో మైనారిటీ మోర్చా చేస్తున్న విశేష కార్యక్రమాలను ప్రజలకు తెలియపరిచే విధంగా తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా రహ్మతుల్లా తెలిపారు. బిజెపి మైనారిటీ మోర్చా ను మరింత పటిష్ట పరచేందుకు తన వంతు సహాయం అందిస్తానని ఆయన వెల్లడించారు.