31.7 C
Hyderabad
May 2, 2024 08: 41 AM
Slider ముఖ్యంశాలు

పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి ఎన్నికలకెందుకు?

#Raghuramakrishnamraju

వైసీపీ పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎందుకని వైసీపీ ఎంపీ కె.రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.

ఎన్నికలు అంటే ఎందుకు భయపడుతున్నారని ఆయన వైసీపీ నాయకులను ప్రశ్నించారు. 151 అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పటి నుంచి ఏం చేసినా చెల్లుతుందనే భావన తమ పార్టీ నేతల్లో కనిపిస్తోందన్నారు.

ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్‌ లేఖ బాధ్యతారాహిత్యమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వమే నిమ్మగడ్డ రాజీనామా కోరడం, రాజ్యాంగ సంస్థలను విచ్ఛిన్నం చేయడానికి నిదర్శనమని  రఘురామ కృష్ణరాజు విమర్శించారు.

గవర్నర్ ప్రేక్షక పాత్ర వహిస్తే కోర్టులు జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించమని ఆదేశించవచ్చన్నారు.

అధికారులు, పోలీస్ సిబ్బంది ముందుకు రాకుండా.. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి తెచ్చుకోవద్దని రఘురామ హితవు పలికారు.

Related posts

డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించిన ప్రభుత్వ విప్

Satyam NEWS

సంకురాత్రి

Satyam NEWS

కాపు సంఘం ఆధ్వర్యంలో కోలా నాగేశ్వరరావుకు ఘన సన్మానం

Satyam NEWS

Leave a Comment