40.2 C
Hyderabad
April 28, 2024 17: 17 PM
Slider ప్రత్యేకం

4న తెలంగాణా కాంగ్రేస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ

rahul gandhi meets telangana congress leaders on april 4

ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజగా మరోసారి సీనియర్ నేతలతో రాహుల్ గాంధీ ఈనెల 4న సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశానికి తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జి మాణికం ఠాగూర్ కూడా హాజరుకానున్నట్టు సమాచారం.

పాదయాత్ర లో వున్న మల్లు బట్టి విక్రమార్క తన యాత్ర ను ఆపేసి ఢిల్లీ కి వెళ్తున్నారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరు తమ పర్యటనలను వాయిదా వేసుకొని ఢిల్లీ బాటా పట్టారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం, రేవంత్ రెడ్డి పై పలువురు సీనియర్లు ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత చేకూరింది.

Related posts

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో చాగంటి

Satyam NEWS

భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆలయం

Satyam NEWS

విమానాల తయారీ కంపెనీకి శంకుస్థాపన చేసిన ప్రధాని

Satyam NEWS

Leave a Comment