సమయం చిక్కినప్పుడల్లా తనలోని కళాకారున్ని బయటకు తీసుకువస్తున్నాడు రాజన్నసిరిసిల్ల జిల్లాకలెక్టర్ కృష్ణభాస్కర్. నిత్యం జిల్లా వ్యవహారాలు ,పాలనాపగ్గాలతో ఊపిరి సలపని పని నుంచి సేదదీరి, తనకిష్టమైన వీణావాద్యాన్ని చేతబూనారు.ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘ఎట్ హోంలో ‘ భాగంగా, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా, కలెక్టర్ కృష్ణభాస్కర్ కూడా తనకు ప్రావీణ్యమున్న వీణ వాద్య కచేరీతో అందరినీ ఔరా అనిపించారు.
ఎందరో మహానుబావులు అంటూ త్యాగరాయ కృతిని అద్భుతంగా వాయించారు.కలెక్టర్ కృష్ణభాస్కర్ ఐఏఎస్ చదివి వృత్తి రీత్యా ఓ జిల్లా పాలనాధికారిగా తన ఆశయాన్ని సాధించినా, ప్రవృత్తి రీత్యా సంగీతంపై ఉన్న మమకారం, తృష్ణ కళాకారుడిగా అతని బిజీ లైఫ్ ను రిలాక్స్ చేస్తున్నాయి.