కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజిగూడెం గ్రామానికి చెందిన డి.జి.ఎం.ఎన్. సాయి కుమార్ కి ఆచర్విత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మథర్ తెరిస్సా రాష్ట్ర స్థాయి సేవా పురస్కారం లభించింది.
నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్వాహకులు ఈ అవార్డును సాయి కి ప్రదానం చేశారు. ఈ అవార్డును సాయి ఐ.ఆర్.ఎస్.కస్టమ్స్ అసిస్టెంట్ అండ్ ఎస్సైజ్ కమీషనర్ డా.సి.హెచ్.ఉషా కిరణ్, నెల్లూరు జిల్లా సహకార బ్యాంకు అధికారి కె.తిరుపాల్ రెడ్డి,హైదారాబాద్ విశ్రాంత పోలీస్ సూపరింటెండెంట్ డా.కాకుమాను రాజ శిఖామణి,
నెల్లూరు జిల్లా పాస్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డా.డేవిడ్ దయా సాగర్, జిల్లా కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిన్ను గంగాధరెడ్డి, చెన్నై గ్లోబల్ ఇన్ఫెర్మషన్ సెంటర్ అధికారి ఎస్.వి.రమేష్, హెచ్.యు.ఎం.రాష్ట్ర అధ్యక్షురాలు సయ్యద్ సమీ హుస్సేని, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ వై.సి.పి మహిళా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరీ,విశ్రాంత మండల విద్యా శాఖాధికారి గుంటుపల్లి మాలకొండయ్య,జంగం రమణయ్య తదితరుల చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ తనను రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసిన ఆచర్విత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వి.డి.కృపాల్,తోటి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆచర్విత ఫౌండేషన్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎడగా గలదని సాయి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.