33.7 C
Hyderabad
April 29, 2024 02: 09 AM
Slider కరీంనగర్

కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న రామగుండం పోలీస్ కమిషనర్

#RamagundamCP

రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ గోదావరిఖని పట్టణం ప్రభుత్వ హాస్పిటల్ లో  కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆయనతో బాటు ఇతర పోలీస్ అధికారులు, పోలీసు సిబ్బంది కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

వ్యాక్సిన్  మొదటగా ఫ్రoట్ లైన్ వారియర్స్ అయిన మెడికల్ సిబ్బందికి ఇచ్చారు. ఇప్పుడు పోలీస్, మున్సిపల్ సిబ్బందికి ఇస్తున్నారు. వ్యాక్సిన్ వలన నష్టాలు ఉన్నాయని కొంతమంది అపోహలు సృష్టించినా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. ప్రతిఒక్కరు వ్యాక్సిన్ ను వేయించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు.

విడతలవారీగా పోలీసు అధికారులు, సిబ్బంది రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఉచితంగా వేస్తున్న వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కమీషనర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్, డాక్టర్ కృప బాయ్ (డిస్ట్రిక్ట్ ఇంయునేషన్ ఆఫీసర్), డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఫిజిషన్, డాక్టర్ బిష్మ, RMO, డాక్టర్ సురేష్ బాబు, మెడికల్ ఆఫీసర్, జమున నర్సింగ్ సూపరింటెండెంట్, నాగమణి,ట్రాఫిక్ ఎస్ ఐ నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంట్లో పెట్రోలు నిల్వతో చెలరేగిన మంటలు

Satyam NEWS

ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలి

Bhavani

జగన్ రెడ్డి మీ పార్టీకి డీఫాక్టో పార్టీ అధ్యక్షుడా?

Satyam NEWS

Leave a Comment