40.2 C
Hyderabad
April 29, 2024 15: 37 PM
Slider ముఖ్యంశాలు

రాష్ట్రపతి పర్యటనకు రామప్ప దేవాలయం సిద్ధం

#Draupadi Murmu

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నకు రామప్ప సర్వం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కాన్వాయ్ ట్రయిల్ రన్ పూర్తి చేసారు. ప్రధాన రహదారులు అన్నింటిని శుభ్రం చేసారు. రహదారుల ఇరువైపులా తెల్లని పరదాలు ఏర్పాటు చేసారు. రామప్ప ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ‘ప్రసాద్‌’ పథకంలో భాగంగా వివిధ రకాల అభివృద్ధి పనులకు రాష్ట్రపతి శంకుస్థాపన చేయనుండటంతో ఇందుకు సంబంధించిన శిలాఫలకం పనులు అన్నీ పూర్తి అయ్యాయి.

కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో మంగళవారం రామప్ప ఆలయ ప్రాంగణం లో జిల్లా అధికార యంత్రాంగంతో కీలక సమీక్షనిర్వహించారు. అధికారుల విధులను మరోసారి విశదీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కావాల్సిన ఏర్పాట్లుచేస్తున్నట్లు తెలిపారు.అధికారులు అందరు సమన్వయము తో పని చేసి విజయవంతం చేయాలి అని అన్నారు.సాయుధ పోలీసు నిఘాను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

భద్రత ఏర్పాట్లలో ఏ మాత్రం నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలనిఆదేశించారు.అధికారులకు తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వర్థించలని సూచించారు. రాష్ట్ర పతి పర్యటన బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందని అన్నారుగిరిజన కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని తెలిపారు.. రామప్ప గార్డెన్‌ను పునరుద్ధరించడంతో పాటు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చేయాలి అని అన్నారు.

Related posts

మైనర్ బాలిక సోనూ కౌర్ ను హత్య చేసిన దుండగులను శిక్షించాలి

Satyam NEWS

ఈ నెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Satyam NEWS

ఎంపీ అభ్యర్థి గంటా న‌ర‌హ‌రితో రాజంపేట టీడీపీ లో జోష్

Satyam NEWS

Leave a Comment