ట్విట్టర్ వేదికగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ కాపులను అవమానపరిచిన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణ చేయాలని కాపు సంక్షేమ యువసేన ఆర్కాట్ కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కాపు కులం ను డబ్బుకు అమ్మేసారని అతను చెప్పడం అతని సంస్కారహీనతకు నిదర్శనమని అన్నారు. వర్మ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బహిష్కరణ చేయాలనీ,
అతని సినిమాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేసారు. తరువాత జిల్లా యువసేన అధ్యక్షులు రాజు రాయల్ మాట్లాడుతూ సమాజంలో పార్టీపరంగా విమర్శలు చేయాలనీ కులంను ఉద్దేశించి వర్మ ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత పోలీస్ అధికారి కృష్ణయ్య, వి.ఎస్. హేమంత్, మూర్తి, హరి, రామారావు తదితర సభ్యులు పాల్గొన్నారు