32.2 C
Hyderabad
May 2, 2024 02: 00 AM
Slider ఆంధ్రప్రదేశ్

నో బ్రేక్: తిట్టడం… తిట్టించుకోవడం ఇదే పని

#Rammohan Naidu TDP

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లపై ట్విట్టర్ లో అత్యంత నీచమైన కామెంట్లు పెట్టే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ది ఒకటి అను రెండు తిట్టించుకో అనే రీతిలో సాగుతున్నది. సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబుగారు.

రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు’ అని విజయసాయి ట్వీట్ చేశారు. దానికి టీడీపీ ఎంపి రామ్మోహన్ నాయుడు నేడు కౌంటర్ ఇచ్చారు.

‘అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు పనికి పోతురాజు. సీనియర్లు అందరూ చేతగానోడి పాలన చూసి ”ఛీ” కొడుతున్నారు. కారు దించేశారనే కక్షతో మామ అప్రూవర్ గా మారి అల్లుడిని కుర్చీ నుండి దించేయాలని కుట్ర మొదలెట్టాడు. ప్రత్యేక హోదాపై చేతులెత్తేశారు. ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించడం చేతకాలేదు.

మూడు ముక్కలాట మొదలెట్టి మూతిముడుచుకొని కూర్చోవడం తప్ప ఏడాదిలో మామ,అల్లుడి వలన ఏ ప్రాంతానికి ఒరిగింది ఏమీ లేదు. ఢిల్లీలో కాళ్లు మొక్కడం, ట్విట్టర్ లో రెచ్చిపోవడం మాని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు’ అని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.

Related posts

సీపీబ్రౌన్ గ్రంధాలయ అభ్యన్నతికి వైస్సార్ సహకారం మరువలేనిది

Satyam NEWS

ప్రజాప్రతినిధుల,అధికారుల నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణం

Satyam NEWS

మహనీయుడి పేరు మార్చి మతతత్వం ప్రదర్శించిన వైనం

Satyam NEWS

Leave a Comment