38.2 C
Hyderabad
April 28, 2024 20: 40 PM
Slider కృష్ణ

విజయవాడలో బాలికపై సామూహిక అత్యాచారం

#rape

బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి…..

విజయవాడలో మరో దారుణం జరిగింది. ఒక బాలికతో పరిచయం పెంచుకున్న ఒక యువకుడు గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. వాడొక్కడే కాదు వాడి స్నేహితులను కూడా తీసుకువచ్చి బాలికపై అత్యాచారం చేయించాడు. దాంతో బాలిక ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అయింది. నగరంలోని బెంజి సర్కిల్ ప్రాంతానికి చెందిన నిందితుడు బాధిత బాలిక(14)తో పరిచయం పెంచుకున్నాడు.

ఈ ఏడాది మే నెలలో బాలికను తన బైక్‌పై ఎక్కించుకుని పటమట జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని ఓ భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత మరోమారు బాలికను భవనంలోకి తీసుకెళ్లాడు. ఈసారి తన స్నేహితులు బబ్లు, ప్రకాశ్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టారు.

గత కొన్ని రోజులుగా బాలిక శరీరాకృతిలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. బాలిక తల్లిదండ్రులు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మానవత్వం తలదించుకునే సందర్భం ఇది

Satyam NEWS

హిందూ దేవాలయాలను సాదువులకు అప్పగించండి

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం శివారు ప్రాంతాల‌లో విస్త్ర‌తంగా మ‌త  ప్ర‌చారం

Satyam NEWS

Leave a Comment