40.2 C
Hyderabad
April 26, 2024 11: 20 AM
Slider పశ్చిమగోదావరి

రాజు వయ్యా మహరాజు వయ్యా…..

#krishnamraju

రాజు అంటే రాజే…. బతికి ఉన్నా చనిపోయినా… అనే విషయాన్ని ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు నిరూపించారు. వాజ్ పేయి మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా పని చేసిన రెబెల్ స్టార్ సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రారాజుగానే వెలుగొందారు. అలాంటి ఆ రెబల్ స్టార్ చనిపోతే తదుపరి కార్యక్రమాలు కూడా అంతే స్థాయిలో ఉండాలి కదా?

ఇదే విషయాన్ని ఆలోచించి ఆయన కుటుంబ సభ్యులు కృష్ణంరాజు స్వగ్రామమైన మొగల్తూరులో సంతాప సభ ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాట్లు అత్యంత ఘనంగా ఉండటమే కాకుండా కనీసం 70 వేల మంది నుంచి లక్ష మంది వరకూ భోజనాలు ఏర్పాటు చేశారు. కేవలం ఆహార పదార్ధాల కోసమే ప్రభాస్ కుటుంబ సభ్యులు దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

భోజనం చేసేందుకు వచ్చే వారి కోసం మొగల్తూరుకు 10 లారీల వాటర్ బాటిళ్లు రవాణా చేశారు. కమ్మని బిర్యానీ తో బాటు 3 రకాలు వెజ్ కూరలు తయారు చేయించారు. అదే విధంగా 8 రకాల చేపల వంటకాలు, 3 రకాల రొయ్యల వంటకాలు చేయించారు. 2 రకాలు పీతల వంటకాలు కూడా వడ్డించనున్నారు. వీటన్నింటితో బాటు చికెన్, మటన్, స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు ఏర్పాటు చేశారు.

Related posts

హుజూరాబాద్ నుంచి దళిత సాధికార పథకం ప్రారంభం

Satyam NEWS

బ్రహ్మాండమైన కథ-కథనాలతో ఓ రేంజ్ ప్రొడక్షన్స్ “బ్రహ్మ రాసిన కథ”

Satyam NEWS

సి.సి. రోడ్లకు నిధులు మంజూరు చేయాలి

Sub Editor

Leave a Comment