కడప జిల్లా పుల్లంపేట మండలం లో గురువారం భారీ ఎర్రచందనం డంప్ లను పోలీసులు,అటవీశాఖ సిబ్బంది వేరు వేరుగా చేపట్టిన కుంబింగ్ లో స్వాధీనం చేసుకున్నారు.
ముందస్తు సమాచారం మేరకు తరలించడానికి సిద్ధపరిచిన వత్తలూరు దేవసంద్రం సి.సి.కుంటలో అటవీశాఖ అధికారులు 46 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోగా,వాటిని రాజంపేట రైల్వే స్టేషన్ సమీపం లోని ఎర్రచందనం గోడౌన్ కు తరలించారు.
అదే విధముగా పోలీసులు ప్రత్యేకంగా చేపట్టిన దాడుల్లో 70 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని పుల్లంపేట పోలీస్ స్టేషన్ కి తరలించారు.