మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్య క్షేత్రం అయిన ఏడుపాయల ఆలయ ఈవో కు కరోనా పాజిటివ్ వచ్చింది.
మహా శివరాత్రి సందర్భంగా అత్యంత వైభవంగా ఏడుపాయల జాతర జరిగిన విషయం తెలిసిందే. గత వారం జరిగిన జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ఆలయ ఈవోకు కరోనా సోకడంతో అక్కడి సిబ్బందికి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు.
అదే విధంగా వారం రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.