28.7 C
Hyderabad
April 27, 2024 05: 48 AM
Slider వరంగల్

ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీల మృతి

#Roadaccident

వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొత్తం ఐదుగురుమహిళా కూలీలు ఈ ప్రమాదంలో మరణించారు.

మిరప తోటలో పనులు చేసేందుకు ఆత్మకూరు మండల కేంద్రానికి పలువురు మహిళలు నేటి ఉదయం ఆటోలో వెళ్తున్నారు.

నీరుకుల్లా కటాక్షపూర్ మూల మలుపు వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన తుఫాన్ వాహనం కూలీల ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

ఆ సమయంలో ఆటోలో 20 మంది మహిళల వరకూ ఉన్నారు. అందులో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.

ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Related posts

కొమురం భీం జిల్లాలో వైద్య కళాశాలకు సానుకూలత

Satyam NEWS

జగన్ ప్రభుత్వం.. మైనార్టీ లకు ఏం చేసింది..?

Bhavani

పౌర విమానయానంలో నైపుణ్యాభివృద్ధికి తీసుకున్న చర్యలు ఏమిటి?

Satyam NEWS

Leave a Comment