వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొత్తం ఐదుగురుమహిళా కూలీలు ఈ ప్రమాదంలో మరణించారు.
మిరప తోటలో పనులు చేసేందుకు ఆత్మకూరు మండల కేంద్రానికి పలువురు మహిళలు నేటి ఉదయం ఆటోలో వెళ్తున్నారు.
నీరుకుల్లా కటాక్షపూర్ మూల మలుపు వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన తుఫాన్ వాహనం కూలీల ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ఆ సమయంలో ఆటోలో 20 మంది మహిళల వరకూ ఉన్నారు. అందులో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.