అనారోగ్యంతో బాధపడుతున్న కొందరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందిన సహాయాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అందచేశారు. ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు జరిగిన ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ కూడా పాల్గొన్నారు.
చిల్కానగర్ డివిజన్ లబ్ధిదారులైన బి. రాములు 60,000/- సి.హెచ్. స్రవంతి 42,000/- ఎస్. దేవకమ్మ 20,000/- చర్లపల్లి డివిజన్ లబ్ధిదారులు బిక్షపతి 60,000/- సాయి చరణ్ 60,000/- శ్రీలత 40,000/- లకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన ఎల్వోసీ లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, గరిక సుధాకర్, వి. బి. నరసింహ, పిట్టల నరేష్, గుడి మధుసూదన్ రెడ్డి ,బింగి శ్రీను, మేకల ముత్యం రెడ్డి, జెసిబి రాజు, రాజు యాదవ్ , బాజీ భాషా, సూరం శంకర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.