ప్రజలందరూ చల్లగా ఉండాలని, వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని లంబాడీలు శీతల పండుగను ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం గాంధీనగర్ తండాలో మంగళవారం నాడు ఈ వేడుక జరిగింది.
లంబాడీల ఆరాధ్యదైవం శీతల పండుగ సందర్భంగా తండాలో తల్లి పూజ కార్యక్రమం చేశారు. వర్షాలు బాగా కురిసి, పాడిపంటలు బాగా పండాలని, ప్రజలందరినీ చల్లగా ఉండాలని ఆ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్, బంజారా సంఘం సూర్యపేట జిల్లా యూత్ అధ్యక్షుడు రవి నాయక్, తండా సర్పంచ్ అరుణ శీను నాయక్,తండా పెద్ద నాయక్ లు తండా చిన్న నాయక్ లు మాజీ సర్పంచ్ పెద్దలు చిన్నలు, మహిళలు పాల్గొన్నారు.