38.2 C
Hyderabad
April 29, 2024 19: 08 PM
Slider కడప

మత ప్రచారం చేస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులు

#ramesh naidu

ఉచిత బైబిల్ విద్యా బోధన కావాలా? అయితే మీరు పెద్దగా కష్టపడక్కరలేదు. మీ గ్రామ సచీవాలయ కార్యదర్శిని సంప్రదించండి.

ఇదేదో మేం చేస్తున్న ప్రకటన అనుకోవద్దు సమా. ఇది ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ కార్యదర్శులు చేస్తున్న పని. బైబిల్ ఉచిత విద్యా బోధన కోసం ఆంధ్రప్రదేశ్ లో వెబినార్లు నిర్వహిస్తున్నారు.

ఈ వెబినార్లు ఎప్పుడు జరుగుతాయో గ్రామ సచివాలయం కార్యదర్శులు అందరికి మెసేజీలు పంపిస్తున్నారు.

ప్రభుత్వం వద్ద జీతాలు తీసుకుంటున్న వారు మత ప్రచారం చేయడం ఏమిటనుకుంటున్నారా? అదే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విశేషం అని బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సామాజిక మాధ్యమాలను గ్రామ సచివాలయ ఉద్యోగులు మత ప్రచారానికి కూడా చక్కగా ఉపయోగిస్తున్నారు.

బాగుంది వై ఎస్ జగన్ ప్రభుత్వ ఘనకార్యం అని ఆయన అన్నారు. ప్రభుత్వ నిధులతో ఇలా మత ప్రచారం నిర్వహించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇలాంటి హీన స్థితికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వచ్చినందుకు సిగ్గుపడాలని ఆయన అన్నారు.

ప్రభుత్వ పెద్దలకు ఈ మత ప్రచారంతో సంబంధం లేకపోతే తక్షణమే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రమేష్ నాయుడు ట్విట్టర్ లో డిమాండ్ చేశారు.

Related posts

ఆర్థికంగా చితికినా అసమాన ప్రతిభ చూపిన వైష్ణవి దేవి

Bhavani

హ్యాపీ పొంగల్: కొత్త దిశలో దినకరుడి దివ్యయాత్ర

Satyam NEWS

రామతీర్థం లో వైభవంగా కోదండ రాముని కోటి దీపోత్సవం

Satyam NEWS

Leave a Comment