39.2 C
Hyderabad
April 28, 2024 13: 22 PM
Slider ఆధ్యాత్మికం

రామతీర్థం లో వైభవంగా కోదండ రాముని కోటి దీపోత్సవం

#Ramakoti

కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీరామగిరిపై కొలువైన కోదండ రాముని కోటి దీపోత్సవ కార్యక్రమం జరిగింది. కరోనా నిబంధనల మేరకు భక్తులచే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని  నెల్లిమర్ల ఎమ్మెల్యే బీ. అప్పలనాయుడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

రామాలయంలోని అఖండ జ్యోతి ని ఆలయ ఈఓ బి హెచ్ వి ఎస్ ఎన్ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ప్రధానార్చకులు సాయిరామాచార్యులు, కిరణ్ , నరసింహాచార్యుల వారు మేళతాళాలతో ప్రధానాలయం నుండి శ్రీరామగిరి వద్దకు తీసుకొని వచ్చి కార్యక్రమమును ప్రారంభించారు.

ఈ సందర్భంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే బీ.అప్పలనాయుడు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో భక్తి భావం పెరుగుతుందన్నారు.తద్వారా భగవంతుని ఆరాదిస్తే మన ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు., ప్రతి ఏడాది ఈ దీపోత్సవం ఘనంగా  శ్రీరామతీర్థం సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహస్తామని తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో చనమల్లు వెంకట రమణ, రేగాన గోవిందరావు, సుదర్శనం విజయకుమార్ ఆచార్య, చిల్ల రామకృష్ణలతో పాటు భక్తులు పాల్గొన్నారు.

Related posts

8న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

Satyam NEWS

రెడీ: స్థానిక సంస్థల ఎన్నికలకు విశాఖ జిల్లా సిద్ధం

Satyam NEWS

కాంగ్రెస్ నాయకుడు హరీశ్ రావత్ కు అస్వస్థత

Satyam NEWS

Leave a Comment