సిఎంఆర్ ఎఫ్ కు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలజీతం విరాళంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగతంగా తన కుటుంబం నుంచి రూ 10లక్షలు విరాళాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
సిఎం రిలీఫ్ ఫండ్ కు టిడిఎల్ పి నుంచి విరాళం ఇవ్వాలని టిడిఎల్ పి సభ్యులతో ఆన్ లైన్ సమావేశంలో చంద్రబాబు కోరడంతో అందరూ అంగీకరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధానికి, బాధితుల సహాయానికి ఈ మొత్తం వినియోగించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ తమవంతుగా ప్రభుత్వాలకు సహకరించాలని ఆయన కోరారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరారు.