హన్మకొండలోని స్పందన మానసిక, బధిరుల ఆశ్రమంలో ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు జరిగాయి. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్, మాజీ సీడబ్ల్యూసి చైర్ పర్సన్ డా. కరుకాల అనితారెడ్డి జాతీయ జెండాని ఎగురవేశారు. అనంతరం జాతీయగీతాన్ని ఆలాపించి, మహనీయుల గురించి పిల్లలకు వివరించారు. పిల్లలు పాటలు పాడి ఆహుతులను అలరించారు. అనంతరం పిల్లలకు బిస్కెట్స్, చాక్లెట్స్, స్వీట్స్ అందించారు. అనితారెడ్డి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఇక్కడ నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈ రోజు ప్రత్యేకతను పిల్లలకు తెలియచేయడం ద్వారా వారికి దేశభక్తి, మహనీయుల పట్ల గౌరవం పెరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికి దేశభక్తి, మన భారతదేశం పట్ల ప్రేమ గౌరవం అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుచరిత, వసుధ, హరిత పిల్లలు పాల్గొన్నారు.
previous post