28.7 C
Hyderabad
April 26, 2024 09: 53 AM
Slider విశాఖపట్నం

విశాఖ ఆసుపత్రులపై గగనం నుంచి కురిసిన పూలు

#CoronaFlowersVizag

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నోళ్లే ఇప్పుడు సర్కారీ  వైద్యులే భేష్‌ అంటూ కితాబిస్తున్నాయి. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులను వినూత్నంగా సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా  త్రివిధ దళాలు దిల్లీ, హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న కొవిడ్‌ ఆసుపత్రులపై హెలీకాప్టర్లతో పూలవర్షం కురిపించాయి.

విశాఖ నగరంలోని ఛాతి, అంటువ్యాధుల ఆసుపత్రి, గీతం ఆసుపత్రులపై వాయుసేన సిబ్బంది హెలీకాప్టర్‌తో ఆదివారం ఉదయం పూలజల్లు కురిపించారు. రక్షణ దళాల అధికారులు ఈ సందర్భంగా వైద్యులను సత్కరించారు.

Related posts

టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన.. కొత్త షెడ్యూల్‌ విడుదల

Sub Editor

కాంగ్రెస్ ఫిషర్ మెన్ రాష్ట్ర కార్యదర్శిగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

Bhavani

సెలబ్రేషన్: పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మాగంటి

Satyam NEWS

Leave a Comment