ఇదే అంశంపై సీబీఐటి కాలేజీలో నేడు పూర్తి స్థాయి సదస్సు నిర్వహించారు. సీబీఐటి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి ఈ సదస్సులో స్వాగత ఉపన్యాసం చేశారు. పిట్స్బర్గ్ యుపిఎంసి కార్డియాలజీ ప్రొఫెసర్, షేర్ ఇండియా చైర్మన్ డా. పి.ఎస్. రెడ్డి ఇండో-అమెరికన్ సంయుక్త ప్రాజెక్టు అయిన కృత్రిమ గుండె మీద పరిశోధన మరియు అభివృద్ధి ప్రాజెక్ట్ పురోగతి వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో ఒక భాగమైన లెఫ్ట్ వెంట్రిక్యులర్ (ఎడమ జఠరిక) అభివృద్ధికి సంబంధించిన వివరాలను సాదియా అలీ వివరించారు. హైదరాబాద్లోని వసంత టూల్ క్రాఫ్ట్స్ జనరల్ మేనేజర్ ఎన్. సురేష్ కుమార్ ఇంజెక్షన్ మోల్డింగ్ ప్రక్రియను ఉపయోగించి ఎడమ జఠరిక సహాయక పరికరాలు అభివృద్ధి చేయటం గురించి వివరించారు. హైదరాబాద్లోని లక్వెన్ సిస్టమ్స్ చైర్మన్ సాయి కుమార్, రమేష్ రెడ్డి ఎల్విఎడి కోసం మోటారు అభివృద్ధి గురించి వివరించారు.
previous post