ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్.జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ చేసింది.
అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను జగన్ సర్కార్ మరింత సరళతరం చేసింది.
నిబంధనల సరళతరంతో ఎక్కువమంది అగ్రవర్ణ పేదలకు మేలుకలుగుతుంది. కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణపేదలకు ఈ రిజర్వేషన్లు వర్తింపచేస్తారు.
మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీన్ని రూ.6లక్షల నుంచి రూ. 8లక్షలకు పెంచారు.
రూ.8లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీచేయాలని కడా తహశీల్దార్ లకు ఆదేశాలు జారీ చేశారు.