రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని గాంధారి ఎంపీపీ రాధ బలరాం నాయక్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శనివారం భూప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన ప్రతి రైతుకు నూతన పాస్ పుస్తకాలను అందించడం జరుగుతుందని అన్నారు.
రికార్డుల పరిశీలన అనంతరం నూతన పాస్ పుస్తకాలు రైతలకు ఇస్తామని తహశీల్దార్ సంగమేశ్వర్ తెలిపారు. అధికారులు నేరుగా గ్రామాల్లో పర్యటించి రైతుల వివరాలు సేకరించడం జరుగుతుందన్నారు.ఆయా గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ నర్సింహారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.