ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో భవనం పై నుండి కింద పడి రోగి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే సోమవారం ఉదయం రిమ్స్ ఆసుపత్రి భవనం కింద మృతదేహం కనబడటంతో స్థానికులు సిబ్బంది తెలియజేశారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా ఆయన జేబులో ఉన్న ఆధార్ కార్డు ను బట్టి ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసారీ గ్రామానికి చెందిన గంగన్న గా గుర్తించారు.
మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.