చిత్తూరు జిల్లా పుత్తూరు హిమజ హై స్కూల్ దగ్గర ఆర్ టి సి బస్సును ఢీకొన్న స్కూటర్ ఆదివారం చోటుచేసుకుంది.
ఎస్ ఆర్ పురం మండలం కు చెందిన కుపేంద్రన్ సుమారుగా 21వయసు గల యువకుడు, చెన్నై గోల్డెన్ సెల్టర్స్ కిచెన్ సెక్షన్ లో పని చేస్తున్నాడు.
చెన్నై నందు డ్యూటీ ముగించుకొని, అతని స్వగ్రామం ఎస్ ఆర్ పురంకు వెళ్తుండగా పుత్తూరు కార్వేటినగరం రోడ్డు బ్రహ్మంగారి గుడి దగ్గర అతను ప్రయాణిస్తున్న స్కూటర్ అదుపు తప్పడంతో ఎడమ చేతి వైపు సైడ్ చేస్తుండగా, అతని ముందు ఉన్న ఆర్ టి సి బస్సుని సైడ్ తీస్తుండగా అదుపుతప్పి బస్సు కింద పడిపోవడంతో బస్సు వెనకవైపు టైర్లు ఎక్కెడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
ఆర్టీసీ డ్రైవర్ తూర్పు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కుపేంద్రన్ మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పుత్తూరు ఎస్సై రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.