జబర్దస్త్ టివి కార్యక్రమంతో పాపులర్ అయిన ఒకనాటి హీరోయిన్ రోజా ఇప్పుడు మంత్రి అయ్యారు. మంత్రి కావాలనే తన చిరకాల వాంఛ నెరవేరడంతో ఇక ఆమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పనున్నారు. జబర్దస్త్ టి వి కార్యక్రమాన్ని నిర్వహించే సంస్థతో రోజాకు ఎంతో అనుబంధం ఉంది.
రోజా కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆ సంస్థ జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా పిలిచి రోజాకు సెకండ్ ఇన్నింగ్స్ ఛాన్స్ ఇచ్చింది. అప్పటి నుంచి జబర్దస్త్ రోజాగా పాపులర్ అయిన ఈనాటి మంత్రి రోజా ఇప్పుడు ఇక తాను షూటింగ్ లలో పాల్గొననని ప్రకటించారు. మంత్రి అయినందున షూటింగ్ లు మానేస్తున్నట్లు రోజా తెలిపారు.