39.2 C
Hyderabad
May 3, 2024 13: 32 PM
Slider వరంగల్

నిరుపేద కూలీలకు ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత

#RRFoundation

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రోజువారీ కూలీలకు ఆర్ ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ గత పది రోజులుగా కిరాణా సామాగ్రిని అందచేసి వారిని ఆదుకుంటున్నది. వరంగల్ జిల్లా లోని పలు ప్రాంతాలలో నివశిస్తున్న ఆర్థికంగా బలహీనమైన వ్యక్తులకు సాయం చేస్తున్నట్లు ఆర్ అండ్ ఆర్ ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడు, చైర్మన్ కె. రఘురామ్ తెలిపారు.

గత పది రోజులుగా బియ్యం, నూనెలాంటి మొత్తం 10 నిత్యావసర కిరాణా వస్తువులను అందచేస్తున్నామని, దీనివల్ల ఎంతో మందికి ఉపశమనం కలుగుతున్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా వాలంటీర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, కుమారస్వామి సభ్యుల బృందం సమర్ధంగా పని చేస్తూ అవసరమైన వారిని ఆదుకుంటున్నదని ఆయన తెలిపారు.

Related posts

పంజాబ్‌ అసెంబ్లీలో రణరంగం.. కాంగ్రెస్‌ అకాలీదళ్‌ రచ్చ

Sub Editor

ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు

Satyam NEWS

జెట్ స్పీడ్: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Satyam NEWS

Leave a Comment