27.7 C
Hyderabad
April 30, 2024 09: 41 AM
Slider కడప

రాజంపేట టీడీపీలోకి వైసీపీ, జనసేన నేతల వలసలు

#chandrababu

అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాల్లోని వైసిపి జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి వాసు రాజంపేట నియోజకవర్గం ఇన్చార్జి బత్యాల చెంగల్ రాయుడు, రైల్వే కోడూరు ఇన్చార్జి కస్తూరి విశ్వనాధ నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు టిడిపిలోకి భారీగా వలసలు వచ్చి శనివారం చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే రాజంపేట నియోజకవర్గంలోని ముగ్గురు ప్రధాననేతలు  చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టిడిపి పార్టీలో చేరారు. రాజంపేట జన సేన అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖ నాయకురాలు డిసిటెడ్ ఎమ్మెల్యే పత్తిపాటి కుసుమకుమారి, వైసిపి కి చెందిన ప్రముఖ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రస్తుత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి చిన్నిల్లు గారి పల్లెకు చెందిన పోలి వెంకటసు బ్బారెడ్డి, ఊటుకూరు గ్రామానికి చెందిన ప్రముఖ వైసిపి నాయకులు న్యాయవాది నాగ సుధాకర్ రెడ్డి, నామా హరి పవన్ కుమార్ రెడ్డి, చెర్లోపల్లి గ్రామానికి చెందిన సుందర్ రాజు లు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు.

వీరందరినీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సాధారణంగా ఆహ్వానించారు. పోలి వెంకట సుబ్బారెడ్డి వైసీపీలో ప్రముఖంగా ఉంటూ వచ్చారు ఆయన రెండు పర్యాయాలు మార్కెట్ కమిటీగా చైర్మన్ గా పని చేశారు. ఈయనకు పుల్లంపేట నేతలైన కొల్లం గంగిరెడ్డి ముద్ద బాబుల్ రెడ్డి తదితరులు బంధువులు. రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో ప్రముఖ వైసిపి నేతలు భారీగా వలసలు వచ్చి టీడీపీలో చేరడం పట్ల టిడిపి పార్టీ స్థానంలో  ఉత్సాహం నెలకొంది. దీంతో రాజంపేట రైల్వే కోడూరు నియో జకవర్గాల్లో వైసీపీకి కౌన్టౌన్ స్టార్ట్ అయిందని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి, కోవూరు సుబ్రహ్మణ్యం, బి. హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ రాష్ట్రం లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Bhavani

విశాఖ ఉత్తరం: గ్రౌండ్ కోల్పోయిన గంటా

Satyam NEWS

రాజకీయ మలుపులతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక

Satyam NEWS

Leave a Comment