భర్తతో కలిసి విశాఖపట్నంలోని ఆర్ కె బీచ్ కి వెళ్లి అక్కడ అదృశ్యమైన సాయి ప్రియ కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చింది. నిన్న నెల్లూరులో కనిపించింది. నేడు బెంగళూరు వెళ్లింది… ప్రియుడితో కలిసి. బెంగళూరు నుంచి సాయి ప్రియ తన తండ్రికి వాయిస్ మెసేజి పెట్టడం ఆసక్తి కలిగిస్తున్నది. (కింద ఆడియో వినవచ్చు)
రెండ్రోజుల క్రితం ఆర్కే బీచ్లో అదృశ్యమైన సాయిప్రియ సముద్రంలో గల్లంతైందని భావించి కోస్ట్గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సాయి ప్రియ సముద్రంలో గల్లంతైందని అందరూ భావిస్తుండగా నెల్లూరులో ప్రత్యక్షమైంది.
సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు ఆమె బంధువులు గుర్తించారు. ప్రేమిడికుడితో కలిసి పారిపోయినట్లు గుర్తించారు. శ్రీనివాస్తో వివాహానికి కంటే ముందు.. సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు రెండు సార్లు రవితో కలిసి సాయి ప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్ హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది.
నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్ డే అని శ్రీనివాస్ ఈ నెల 25న హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్కి వెళ్లిన సాయి ప్రియ, అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది.
శ్రీనివాస్ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
నెల్లూరులో ప్రియుడు రవిని పెళ్లి చేసుకున్నట్లు సాయి ప్రియ చెబుతున్నది. బెంగళూరులో కనిపించిన సాయిప్రియ తల్లిదండ్రులకు వాట్సప్ మెస్సేజ్ పెట్టింది. బెంగళూరులో క్షేమంగానే ఉన్నానని, వెతకొద్దంటూ మెస్సేజ్ పెట్టింది. బెంగళూరులో ప్రియుడి తో ఉన్న సాయిప్రియ తాళిబొట్టుతో ఉన్న ఫొటోను పేరెంట్స్కు పంపింది.
రవితో ఇష్టపూర్వకంగానే వెళ్లానంటూ సాయిప్రియ మెస్సేజ్ లో తెలిపింది. నాన్న.. నేను బతకాలనుకుంటున్నా.. నాకోసం వెతకొద్దు.. నా కోసం వెతికితే చనిపోతా అంటూ సాయిప్రియ మెస్సేజ్ చేసింది. రవి పేరెంట్స్ను ఏమీ చేయొద్దంటూ సాయిప్రియ అడిగింది.