ఆర్ధికంగా దివాలా తీసిన పాకిస్తాన్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం కారణంగా జీతాలతో సహా ప్రభుత్వ సిబ్బంది ఖర్చుల బిల్లులను ఆమోదించవద్దని పాకిస్థాన్ ప్రభుత్వం అకౌంటెంట్ జనరల్ను ఆదేశించింది. సమాఖ్య మంత్రిత్వ శాఖలు/విభాగాలు మరియు అనుబంధ విభాగాల అన్ని బిల్లుల ఆమోదాన్ని తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపి వేయాలని ఆర్థిక మరియు రెవెన్యూ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ అకౌంటెంట్ జనరల్ (AGPR)ని ఆదేశించింది. కొన్ని వారాల క్రితం 2.9 బిలియన్ డాలర్ల లోటు ఆందోళనకర స్థాయిని తాకిన పాకిస్థాన్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఇప్పుడు 4 బిలియన్ డాలర్లకు చేరువయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి 1.1 బిలియన్ డాలర్ల సాయం కోసం పాకిస్తాన్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది
previous post
next post