కామారెడ్డిలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్షలు 17 వ రోజు కొనసాగాయి. నిరాహార దీక్షలో భాగంగా బుధవారం రాత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద టెంటులోనే జాగరణ చేపట్టారు. మహిళా ఉద్యోగులు సైతం జాగరణలో పాల్గొన్నారు. జాగరణ సందర్బంగా ఉద్యోగులు జానపద గేయాలలో తమ సమస్యలను చెప్పుకుంటూ పాటలు పాడుతూ కోలాటలు ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండును పట్టించుకోవాలని కోరారు. తమను విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించాలన్నారు. ఫుల్ టైం వర్క్ చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. తమ డిమాండ్స్ పరిష్కారం అయ్యేవరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు.
previous post
next post