28.7 C
Hyderabad
April 27, 2024 05: 26 AM
Slider గుంటూరు

గన్ను కన్నా ముందు జగన్ వస్తాడన్నారు… ఏడీ..రాలేదేం?

#narasaraopet

ఆడ పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని సొల్లు కబుర్లు చెప్పారు. దిశ చట్టం అంటూ మాయ చేసారు. ఇప్పుడు గన్ను రావడం లేదు జగన్ కనపడటం లేదు అని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు.

అత్యాచారాలు జరుగుతున్నా ఒక్క మహిళకు న్యాయం జరిగింది లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ళ ముందే ఆడపిల్లలను మృగాళ్లు బలి తీసుకుంటున్నా జగన్ రెడ్డి లో చలనం రావడం లేదని ఆయన అన్నారు.

నరసరావుపేటలో ప్రేమ పేరుతో డిగ్రీ విద్యార్థిని కోట అనూషను అత్యంత దారుణంగా హత్య చేసాడు మృగాడు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా పబ్లిసిటీ పిచ్చ నుండి బయటికి వచ్చి మహిళలకు రక్షణ కల్పించాలి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అనూష ని హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి. అనూష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

హత్యకు గురైన అనూష మృతదేహంతో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు, సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరావు, టీడీపీ నాయకులు అబ్బురి మల్లి, ఉదయ్ శ్రీ, asf విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.

Related posts

దుబాయ్ లో భారీ వర్షంతో జన జీవితం అతలాకుతలం

Satyam NEWS

నరసరావుపేట ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

గట్టు మట్టి తరలింపు పై తీగ పట్టుకుంటే డొంక కదిలింది..

Satyam NEWS

Leave a Comment