39.2 C
Hyderabad
April 28, 2024 13: 11 PM
Slider సంపాదకీయం

దేవాలయాలపై దాడులకు ధ్వజమెత్తిన పీఠాధిపతులు

#Hindudharmam

ఏపీలో దేవాదాయ శాఖ పనితీరుపై సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయాలపై జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదని సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.

తిరుపతికి 56 కి.మీ.ల దూరంలోని పోన్పాడి గ్రామంలో సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు జరుగుతున్న విషయాన్ని సత్యం న్యూస్ అన్ని మీడియా సంస్థల కన్నా ముందుగా వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ సదస్సులో కంచి కామకోటి జగద్గురువు శంకర పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహా స్వామి, దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురు పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రతినిథిగా శృంగేరి శారదా పీఠం ఎడ్మినిస్ట్రేటర్ శ్రీ గౌరీశంకర్,

హంపి విద్యారణ్య మహా సంస్థాన పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి, పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామివారు, తుని సచ్చిదానంద తపోవన పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి,

అహోబిల మఠాధీశ్వరులు శ్రీమతే శ్రీవన్ శఠకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదశికన్ మహాస్వామి వారి ప్రతినిథి , శ్రీ భువనేశ్వరీ మహాపీఠ ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి మహాస్వామి, శ్రీ ముముక్షుజన మహా పీఠాధిపతి ముత్తీవి సీతారాం గురువర్యులు పాల్గొన్నారు.

సదస్సు విషయాలను భువనేశ్వరిపీఠం కమాలానంద భారతి స్వామి మీడియాకు వివరించారు. గత కొన్ని నెలలుగా ఏపీలో వందలాది ఆలయాలను ధ్వంసం చేశారని..రామతీర్థంలో రాముడు తల ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిబంధన విరుద్ధంగా హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం జోరుగా జరుగుతోందని స్వామీజీ తెలిపారు. మైనారిటీ మెప్పుకోసం హిందూ దేవాలయాల ఆదాయన్ని వినియోగిస్తున్నారని ఆరోపించారు. హిందూ మతాన్ని మట్టుపెట్టే కార్యక్రమాలను ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తిరుమల నుండి శ్రీశైలం వరకు అపచారాలు జరుగుతున్న పట్టించుకోకుండా ఉన్నారని  కమలానంద భారతీ స్వామి మండిపడ్డారు. పుష్పగిరి పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతి మహాస్వామి మాట్లాడుతూ… ఏపీలో దేవాదాయ శాఖ పనితీరు బాగలేదని విమర్శించారు.

అన్యుల పెత్తనం పెరిగిందన్నారు. ఆలయాల ఆదాయాన్ని సెక్యులర్ సంక్షేమ పధకాలకు ఒక్క పైసా ఖర్చు చేయకూడదని…ఆలయాల నిధులను ఇతర హిందూ ఆలయాల కోసం ఖర్చు చేయాలన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి, నిపుణులు ద్వారా ఏపీలో జరుగుతున్న దాడులు…నగలు, ఆస్తులను కాపాడేందుకు కమీటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

పురావస్తు శాఖ పరిధిలోని ఆలయాలను పరిరక్షణకు వారితో ప్రభుత్వం చర్చించి ఆలయాల సంరక్షణకు అవకాశం ఇవ్వాలన్నారు. ఆలయాల విషయంలో పురావస్తు నిబంధనల్లో సడలింపులకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. త్వరలో సనాతన ధర్మ పరిరక్షణ  మహాసభను నిర్వహించబోతున్నామని…వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాలు అమలు చేయాలని కోరుతున్నామని విద్యాశంకర భారతి తెలిపారు.

Related posts

డెకాయిట్లు కూడా చేయని విధంగా వైసీపీ అక్రమాలు

Satyam NEWS

ఫార్మర్ వెల్ఫేర్: రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి

Satyam NEWS

దొరవారి తిమ్మాపురం ప్రజలకు అండగా ఉస్మానియా విద్యార్థులు

Satyam NEWS

Leave a Comment